
ఆరవ అంచెలో ఔటర్ ఫెయిర్ ఏరియాలో తనిఖీలు, ఏడో రౌండ్లో ఇంటీరియర్, ఐసోలేషన్ కార్డెన్ సెర్చ్లు కొనసాగుతాయి. 2025 మహా కుంభానికి హాజరయ్యే భక్తుల భద్రత కోసం మొత్తం 37,611 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో మహా కుంభమేళా ప్రాంతానికి 22,953 మంది పోలీసులు, కమిషనరేట్కు 6,887 మంది, జీఆర్పీకి చెందిన 7,771 మంది పోలీసులను నియమించనున్నారు.
అదే సమయంలో మహిళా భక్తుల భద్రత కోసం 1,378 మంది మహిళా పోలీసులను నియమించనున్నారు. గత కుంభమేళా కంటే ఈ సారి భారీ సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నారు. 2013 మహాకుంభమేళాలో 22,998 మంది పోలీసులను మోహరించగా, గతంలో పోలిస్తే 14,713 మందిని అదనంగా నియమించనున్నారు.
2019 అర్ధ కుంభ్మేళాలో 27,550 మంది పోలీసులతో పోలిస్తే 10,061 మంది పోలీసులను అదనంగా వినియోగిస్తున్నారు. ఇందులో సివిల్ పోలీసులు 18479 మంది, మహిళా సిబ్బంది 1,378 మంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది 1,405 మందిని వినియోగించనున్నారు. ఇక సాయుధ పోలీసులు 1158, మౌంటెడ్ పోలీస్ 146 మంది, రవాణా శాఖ నుంచి 230 మంది, ఎల్ఐయుకు 510 మంది, వాటర్ పోలీస్ 340 మంది, హోంగార్డులు 13,965 మందిని మోహరిస్తారు. ఇంటెలిజెన్స్ యూనిట్ నిమిషానికో నివేదిక అందించనున్నది.
మహాకుంభ్ 2025 భద్రత పరంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిర్భయంగా యాత్రను పూర్తి చేసుకొని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్తో పాటు, ప్రయాగ్రాజ్కు చేరుకునే ప్రతి వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించి భద్రతా సిబ్బంది పూర్తి నిఘా వేసి ఉంచనున్నారు. వివిధ విభాగాల పోలీసులు స్థానిక నిఘా విభాగాలతో నిరంతరం టచ్లో ఉంటూ పర్యవేక్షిస్తారు.
కుంభమేళ సమయంలో 10 రకాల బందోబస్తును కూడా నిర్వహిస్తారు. దీంతో భక్తులు అడుగడుగునా రక్షణ లభించనున్నది. ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ఐసిసిసి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)తో కూడిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఫొటోలు, గుర్తింపు, టీఎస్పీ (టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్) ద్వారా పర్యవేక్షణ జరుగనున్నది.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!