
* క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టి తగ్గింపు
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపుపై జీఎస్టీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై మరింత పరిశీలన చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో పలు వస్తువులపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మరికొన్ని వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో 54వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై జిఎస్టి (వస్తు, సేవల పన్ను)ని తగ్గించడంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం బీమా ప్రీమియంపై జిఎస్టి గరిష్ఠ స్థాయిలో 18 శాతం విధిస్తున్నారు. దీనికి తగ్గించాలని మంత్రులతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జిఎస్టి కౌన్సిల్ చర్చ జరిపింది. ఆరోగ్య, జీవితా బీమా ప్రీమియంపై జిఎస్టి తగ్గించేందుకు జిఎస్టి కౌ న్సిల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినప్పటికీ, వచ్చే సమావేశానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఈ సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపుపై జిఎస్టిని తగ్గించే అంశంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని కౌన్సిల్ భావించింది. కేంద్ర రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ బీమా ప్రీమియంపై జిఎస్టి తగ్గింపు వచ్చే లాభనష్టాలను భేరీజు వేయనుం ది. ఈ అంశంపై విచారణ నిమిత్తం మం త్రుల బృందానికి పంపారు.
ఆరోగ్య బీమాపై జిఎస్టి రేటు తగ్గింపుపై అధ్యయ నం చేసేందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి అధ్యక్షతన మంత్రుల బృందం ఏర్పాటైంది. ఈ మంత్రివర్గం వచ్చే నెల చివరి నాటికి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. 2024 నవంబర్లో జరిగే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో దీనిపై మళ్లీ చర్చిం చి, ఒక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
కొంతమంది కొత్త సభ్యులు కూడా ఈ బృందంలో చేరతారని.. వారంతా అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనంతరం నవంబర్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే క్యాన్సర్ రోగులకు భారీ ఊరట కల్పించారు. క్యాన్సర్ రోగులు ఉపయోగించే ఔషధాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇక నమ్కీన్ స్నాక్స్పై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని తగ్గించారు.
2026 మార్చి తర్వాత కూడా జీఎస్టీ పరిహార సెస్ను కొనసాగించాలా లేదా అనే అంశంపైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీ అంశాలపైనా ఈ 54వ జీఎస్టీ కౌన్సిల్లో చర్చించినట్లు తెలిపారు. అలాగే స్నాక్స్పై జిఎస్టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.
జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో మతపరమైన యాత్రలు చేసే వారి కి శుభవార్త అందించారు. ఇకపై మతపరమైన తీర్థయాత్రలు చేపట్టే వారు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడంపై 18 శాతానికి బదులుగా 5 శాతమే జిఎస్ టి చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిఎస్టి పరిహార సెస్సు కొనసాగించాలా, లే దా అనే అంశంపై మంత్రివర్గానికి సిపారసు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. ఆ న్లైన్ గేమింగ్పైనా కౌన్సిల్ చర్చించింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు