
ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడి, ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.
ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొద్దీ రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
మున్నేరు, పాలేరు, ఆకేరు, కట్టలేరు వాగులు ఉప్పెనలా ఊర్లను ముంచెత్తిన వైనం చూసి చలించిపోయారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి చౌహాన్కు వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలని అమాత్యులు విన్నవించగా, రాష్ట్ర ప్రజలను కేంద్రం ఇతోధికంగా ఆదుకుంటుందని శివరాజ్సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల