‘మేం భారత్తో మంచి సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నాం. అయితే అవి కచ్చితంగా సమానత్వం, పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని యూనస్ నొక్కి చెప్పినట్లుగా ఆయన సహాయకుడు మహ్ఫుజ్ ఆలంని ఊటంకిస్తూ బీఎస్ఎస్ నివేదించింది.
పొరుగు దేశాలతో సంబంధాలకు బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుందని తెలిపారు. సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోపరేషన్)ను పునరుద్ధరించాలని యూనస్ నొక్కి చెప్పినట్లు ఆలం తెలిపారు.
మరోవైపు హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్లో తలదాచుకున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్’ ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని హసీనా సహా పలువురిపై తాత్కాలిక ప్రభుత్వం కేసుల్ని నమోదు చేసింది.
వీటి విచారణ కోసం ఆమెను రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ‘హసీనా సహా పరారీలో ఉన్న వారందరికీ అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్కు దరఖాస్తు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింతపై ఒప్పందం ఉంది’ అని ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లామ్ చెప్పారు. ‘హసీనా సహా పరారీలో ఉన్న వారందరికీ అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్కు దరఖాస్తు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింతపై ఒప్పందం ఉంది’ అని ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లామ్ చెప్పారు.

More Stories
గాజా శాంతి మండలిలోకి భారత్ను ఆహ్వానించిన ట్రంప్
బంగ్లాదేశ్ లో మూడు రోజులలో ఇద్దరు హిందువుల హత్య
ఇరాన్ ఘర్షణల్లో 16,500 మందికి పైగా మృతి