
* కేంద్రం పంపిన రెండు హెలీకాఫ్టర్లను వాడకుండా ఉంచిన రేవంత్
రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిందికింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.ఎస్డీఆర్ఎఫ్ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరులో సమాచారం అందించాలి. 2024-25కి సంబంధించిన తొలివిడత మొత్తం రూ. 208.40 కోట్లను ఈ ఏడాది జూన్ 1న ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు.
అంతకు ముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత విధానంలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికీ పంపాలని కేంద్రం పేర్కొంది. అప్పుడే 2024-25కి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో కేంద్ర వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్కి తెలిపింది.
కాగా, రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. నష్టం వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా నేరుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు, శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నివేదిక ఆధారంగా కేంద్రం తగిన సాయం అందిస్తుందని వెల్లడించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు