దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫల్స్, 315 బోర్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న భద్రతా సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ జరుగుతోందన్న ఎస్పీ… పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఆగస్టు 29వ తేదీన కూడా నారాయణపుర్ జిల్లా అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టు దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 150 మందికి పైగా మావోయిస్టులు మరణించారని పోలీసులు వెల్లడించారు.
కాగా, ఇటీవల ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తామని ప్రకటించారు. మావోయిస్ట్ తీవ్రవాదులపై తుది దాడికి నిర్ణాయక, కఠిన వ్యూహం అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. హింసావాదాన్ని వీడాలని, లొంగుబాట పట్టిన నక్సల్స్ పునరావాసం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒకట్రెండు నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. 2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి తెలిపారు.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవు
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా