
విశ్వహిందూ పరిషత్, (దక్షిణ) క్షేత్ర సంఘటన మంత్రి, చెన్నై
యుగయుగాలుగా హిందువులు పవిత్రంగా చూసుకుని గోవులను చంపడం, మాంసంగా ఉపయోగిస్తుండడం ఆపివేయాలని గోరక్షణ అత్యవసరమని అనేకమంది సాధువులు మాత్రమే కాక గాంధీజీ, వినోబాభావే వంటి వారితో సహా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రతివారు చెప్పేవారు. కానీ స్వాతంత్ర్యానంతరం గోసంరక్షణను నిర్లక్ష్యం చేశారు.
అదే సమయంలో, రాజకీయ లబ్ధికోసం నేతల కుట్రల కారణంగా హిందూ సమాజంలో భాష, ప్రాంతం, కుల వైరుధ్యాల వంటి విభేదాలు కూడా ఉద్భవించాయి. దీని కారణంగా సాధువులు, హిందూ ధార్మిక నాయకులు ఆందోళన చెందారు. హిందూ సమాజ రక్షణకు, జాగృతికై ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరి మనస్సులో ఉండేది.
ఆ సమయంలోనే ప్రపంచలో అనేక దేశాలు స్వతంత్ర్యంగా మారాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు స్వాతంత్ర్య భారతదేశం వైపు ఆశతో, విశ్వాసంతో చూశారు. కానీ నకిలీ లౌకికవాద మనస్తత్వం కారణంగా, మన ప్రభుత్వం విదేశాలలో ఉన్న హిందువుల సమస్యలపై ఉదాసీనంగా ఉండేది. ట్రినిడాడియన్ ఎంపీ, వ్యాపారవేత్త శ్రీశంభునాథ్ కపిల్దేవ్ అక్కడి హిందువుల సమస్యలపై ఒక బృందముగా భారతదేశానికి వచ్చి అప్పటి ప్రధాని నెహ్రూ, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, అధికారులను సంప్రదించగా వారికి నిరాశే ఎదురయింది.
ఆ రోజులలో తన ఉపన్యాసాలతో మేధావి లోకాన్ని సనాతన సత్యం వైపు దృష్టి సారించేటట్లుగా స్వామి చిన్మయానంద ప్రవచనాలు ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించేవారు. విదేశాల్లోని హిందువుల ఘోరమైన దుస్థితిని, అన్య మతాలవారు చేస్తున్న దౌర్జన్యాలను సమాధానం చెప్పలేని అనైక్యతను గమనించి హిందువుల చైతన్యం కోసం ఆయన తన పత్రిక తపోవన్ ప్రసాద్ (నవంబర్, 1963)లో ఒక వ్యాసం వ్రాసారు. తర్వాత హిందూ సమాజం గురించి హిందువుల రక్షణకై పనిచేస్తున్న ‘హిందూ మహాసభ’ కూడా ప్రపంచ హిందూ సదస్సును సూచించింది.
ఈ నేపథ్యంలో, పూజ్య శ్రీగురూజీ గోల్వాల్కర్ కూడా పూజ్య చిన్మయానంద స్వామి, వివిధ సంస్థలు, మరికొంత మంది హిందూ ధర్మం కోసం తపన చెందే ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపారు.
భారతీయ, విదేశాలలో ఉంటున్న హిందువుల సమస్యలు – ప్రభుత్వ విధానం వల్ల హిందువులకు జరుగుతున్న అన్యాయాలు మొదలైన సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేశారు. పూజ్యులు చిన్మయానంద స్వామిజీ అధ్యక్షతన జరిగిన ఈ ప్రథమ సమావేశంలో వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు, హిందూ సమాజంలోని ప్రముఖులు పాల్గొన్నారు.
వారిలో పూజ్యులు రాష్ట్రసంత్ తుకుడోజీ మహరాజ్, పూజ్య మాస్టర్ తారాసింగ్ (సిక్కు), జైనగురు పూజ్యులు సుశీల్ మునీ , సోమనాథ్ దేవాలయ నిర్మాణానికి సూత్రధారి శ్రీకన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షీ (నెహ్రూ కాలంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి) శ్రీ గోల్వాల్కర్ గురూజీ, 40-45 మంది ఇతర పూజ్య స్వామీజీలు, ప్రముఖులు హాజరయ్యారు.
ఆ సమావేశంలో క్రింది ప్రధాన లక్ష్యాలు (1) హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, జాగృతం చేయడం (2) హిందూ సమాజ విలువలు, జీవన మూల్యాలు, హిందూ ‘మాన బిందువులను’ రక్షించడం, ప్రోత్సహించడం (3) విదేశాలలో ఉన్న హిందువులతో సంబంధాలు పెంచుకోవడం, వారికి ధార్మిక ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి తగిన సహాయం అందించడం.
సమ్మేళనాలు – ఉద్యమాలు
ఈ సమావేశ నిర్ణయం ప్రకారం, 1966 జనవరి 22, 23, 24 తేదీలలో కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ లో మొదటి ప్రపంచ హిందూ సమ్మేళనం జరిగింది. ఇందులో 12 దేశాల నుండి 25 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు, మూడు వందల మంది ప్రముఖ సాధువులు పాల్గొన్నారు. తొలిసారిగా నలుగురు శంకరాచార్యులందరూ ఒకే వేదికపైకి వచ్చారు.
విశ్వహిందూ పరిషత్ కమిటీని ప్రకటించారు. మైసూర్ మహారాజ శ్రీజయచామ చంద్ర వడయార్ అధ్యక్షుడయ్యారు. అప్పటికే వారు మద్రాసు ప్రావిన్స్ కు గవర్నర్ గా ఉండేవారు. శ్రీదాదాసాహెబ్ ఆప్టే ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఈ సమావేశంలోనే అనేక కారణాల వలన హిందుత్వాన్ని వదిలి అన్య విదేశీ మతాలలోకి వెళ్ళినవారు తిరిగి తమ పూర్వ ధర్మంలోకి రావచ్చునని చారిత్రాత్మక నిర్ణయించడం జరిగింది.
విశ్వహిందూ పరిషత్ నినాదం “ధర్మో రక్షతి రక్షితః ” గా, “వటవృక్షం” అధికార చిహ్నంగా నిర్ణయించారు. ఈ ప్రపంచ సదస్సు తర్వాత ఆనాటి వివిధ ప్రావిన్సులలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఉడిపి (కర్ణాటక). పంఢరిపూర్ (మహారాష్ట్ర), జోర్హాట్ (అస్సాం), సిద్ధాపూర్ (గుజరాత్) మొదలైనవి. ఈ సమ్మేళనాలలో వివిధ తీర్మానాలు ఆమోదించారు.
(హిందువులందరూ సోదరులు, ఏ హిందువు కూడా పతితుడు కాడు, మన యొక్క దీక్ష హిందూ సమాజం యొక్క రక్షణ, మన యొక్క మంత్రం మనమందరం సమానం.) అనే మంత్రాన్ని సాధువులు నిర్ణయించారు. సమాజానికి ఉపదేశించారు.
రెండవ ప్రపంచ హిందూ సమ్మేళనం 1979 జనవరి 27, 28, 29 తేదీలలో ప్రయాగరాజ్ లో జరిగింది, ఇందులో 18 దేశాల నుండి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సును బౌద్ధ గురువు పూజ్యులు దలైలామా ప్రారంభించారు. ఆయనకు పూజ్య జ్యోతిష్పీఠం శంకరాచార్య స్వాగతం పలికారు. ఇదొక చారిత్రక సంఘటన.
1980 నుండి మోరోపంత్ జీ పింగళే పరిషత్కు మార్గదర్శకులుగా, 1982లో, శ్రీ అశోక్ జీ సింఘాల్ పరిషత్ కేంద్ర సమితిలో సభ్యులయ్యారు. అప్పటినుండి విస్తృతంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1982లో జన్-జాగరణ్ అభియాన్ (సంస్కృతి రక్షా యోజన), 1983లో ఏకాత్మతా యాత్ర (గంగామాత, భారతమాత యాత్ర) వంటి పెద్ద పెద్ద ప్రభావవంతమైన కార్యక్రమాలు జరిగాయి. లక్షల గ్రామాలను కలిపిన ఈ ‘ఏకాత్మత యాత్ర” లో 6 కోట్ల మంది పాల్గొన్నారు.
మొదటి “ధర్మ సంసద్” ( హిందూ పార్లమెంట్ ) న్యూఢిల్లీలో ఏప్రిల్, 1984లో జరిగింది. గత 60 సంవత్సరాలలో అనేక సమావేశాలు జరిగాయి, ఇందులో హిందూధర్మం లోని సుమారు 125 శాఖలకు చెందిన 12 వేల మంది సాధువులు, ఋషి, మునులు పాల్గొన్నారు.
దేశంలోని ఆలయాల అనుసంధానం, అర్చకులకు శిక్షణ, వేదపాఠశాల, సామాజిక సామరస్యం మొదలైన వివిధ పనులు క్రమంగా ప్రారంభమై వేగంగా ‘పరిణామం వైపు’ కొనసాగుతున్నాయి .
సంస్కారం : దేశంలోని మూడు వేల పాఠశాలల్లో లక్షలాదిమంది విద్యార్థులు రామాయణం పరీక్షలు, వందలాది స్థలాల్లో భగవద్గీత పోటీల్లో లక్షలాదిమంది విద్యార్థులు పాల్గొంటున్నారు. షోడశ సంస్కారాలు అందించడానికి ఒక తమిళనాడులోనే 5000 మంది పురోహితులకు, పూజారులకు ప్రశిక్షణను ఇవ్వడం జరిగింది. 31 ప్రాంతాలలో సుమారు 100 సంస్కారశాలలు ప్రారంభమయ్యాయి 17వేలకు పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు.
శ్రీరామజన్మభూమి ఉద్యమం 1984లో ప్రారంభమైంది. శ్రీ రామజానకీ రథయాత్ర, శ్రీరామ శిలాపూజన్, శ్రీరామపాదుకా పూజ, మొదటి కరసేవ (1990), ఢిల్లీ బోట్ క్లబ్ (ఏప్రిల్ 4, 1991) చారిత్రక ర్యాలీ వంటి భారీ సంఖ్యతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ చైతన్యం ఫలితంగా, 6 డిసెంబర్ 1992న కరసేవ,. తదనంతరం కోర్టులు పూనుకొని హిందూ సమాజానికి న్యాయం చేయడం, శ్రీరామమందిరం నిర్మాణం జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభ కార్యక్రమానికి ఐదు లక్షల 25వేల గ్రామాల నుండి 17 కోట్ల కుటుంబాలను కలిసి ఆహ్వానించడం తెలిసిందే.
ఈ చైతన్య కార్యక్రమాల వలన ప్రపంచానికి మేలు చేసే వారము మేము – గర్వుసే కహో హమ్ హిందూ హై – (‘మేము హిందువులమని గర్వంగా చెప్పండి) అనే ఈ నినాదం ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది. 2007లో రామసేతు రక్షా ఆందోళన్ ప్రారంభమైంది. చక్కాజాం, ఢిల్లీలో భారీ ర్యాలీ జరిగింది… ఇది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనాత్మక కార్యక్రమం.
ధార్మిక యాత్రలు
నేడు దేశం మొత్తం 1132 కి గాను 1052 జిల్లాల్లో, 9938 తాలూకాలకు గాను 7500 తాలూకాల్లోనూ 50 వేల గ్రామ కమిటీలు కలుపుకొని మొత్తం 80 వేలకు పైగా కమిటీలు ఉన్నాయి. ఇవికాక 28 వేల సత్సంగ సమితులు, 40 వేల బజరంగదళ్, 5 వేల దుర్గావాహిని యూనిట్లు, ఉండగా, గోరక్ష, సామాజిక సమరసత మంచ్, సంస్కృతం వంటివే మరో 20 విభాగాలలో వేలాది యూనిట్లు పనిచేస్తున్నాయి.
80 విదేశాలలో వివిధ కార్యక్రమాలు జరుపుతుండగా, 30 దేశాల్లో పరిషత్ కమిటీలున్నాయి. బాలసంస్కార కేంద్రాలు, నెలవారీ సత్సంగం, మహాత్ములు, సాధువుల ప్రవచనాలు, సదస్సులు మరియు అన్యాయానికి వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలవంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!