నేపాల్ లో నదిలో బస్సు పడటంతో 14 మంది భారతీయుల మృతి

నేపాల్ లో నదిలో బస్సు పడటంతో 14 మంది భారతీయుల మృతి
నేపాల్ లోని ప్రధాన రహదారిపై భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 14 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి పృథ్వీ హైవే పక్కనే లోతైన లోయలో ప్రవహిస్తున్న యాంగ్డి నదిలో పడిపోయింది. 
 
ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారని, 16 మంది గాయపడ్డారని ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి శైలేంద్ర థాపా తెలిపారు.  ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇంకా ఎంత మంది గల్లంతయ్యారో, ఎంతమంది ఉన్నారో అధికారులు ఇంకా చెప్పలేదు. కానీ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ఉన్నారని వారు అంచనా వేశారు. 
 
రాజధాని ఖట్మాండూ కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుఖైరేని పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రజలను బయటకు తీసేందుకు పోలీసులు, ఆర్మీ రెస్క్యూ సిబ్బంది సహాయం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ కు చెందిన బస్సు నేపాల్ లో రిసార్ట్ పట్టణం పోఖారా నుంచి ఖాట్మండు వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
నేపాల్ లో దేవాలయాల సందర్శనకు సుమారు 50 మంది భక్తులతో ఈ బస్సు గోరఖ్ పూర్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఇదే ప్రాంతంలో జూలై నెలలో కూడా ప్రమాదం జరిగింది. అప్పుడు, రెండు బస్సులపై కొండ పరిచయాలు విరిగిపడిన ప్రమాదంలో ఆ రెండు బస్సుల్లో ఉన్న 65 మందిలో ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సగం మంది మృతదేహాలను మాత్రమే లభ్యమయ్యాయి. ఆ బస్సుల శిథిలాల కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.