
* నలుగురు శంకరాచార్యుల ఉమ్మడి విజ్ఞప్తి
బంగ్లాదేశ్లోని హిందువుల జీవితాలు, గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వ తక్షణం జోక్యం చేసుకోవాలని దేశంలోని శంకరాచార్యులు ఉమ్మడిగా విజ్ఞప్తి చేశారు. రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి సారధ్యంలో జగద్గురు కంచి శంకరాచార్య స్వామిజీతో కలిసి శంకరాచార్యులందరూ మొదటిసారిగా ఒకే వేదికపైకి వచ్చి బంగ్లాదేశ్ లో హిందువుల దుస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చారిత్రాత్మక వేదిక నుండి ప్రతిధ్వనించిన శంకరాచార్యుల ఏకీకృత స్వరం, భారతదేశంలోనే కాకుండా సరిహద్దుల దాటి వారి విశ్వాసాన్ని, సమాజాన్ని కాపాడుకోవడంలో వారి అచంచలమైన నిబద్ధతను స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక నాయకత్వంలో ఈ ముఖ్యమైన క్షణం శాంతి, న్యాయం, ధర్మ సూత్రాలలో లోతుగా పాతుకుపోయిన జాతీయ సరిహద్దులను దాటి చర్యకు పిలుపునిచ్చింది.
ఉత్తరామ్నాయ జ్యోతిష్పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి; దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర్ భారతీ మహాస్వామి జీ, పశ్చిమాన్య ద్వారకా శారదాపీఠాధీశ్వర్ శంకరాచార్య స్వామి శ్రీ సదానంద సరస్వతి జీ మహారాజ్ బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి, ఇతర తానీయుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలతో సహా అనేక సమస్యలపైవి వరించారు.
జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి హింసాత్మక బంగ్లాదేశ్లో హిందువుల భద్రతకు భరోసా ఇవ్వడానికి భారతదేశం బలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. “బంగ్లాదేశ్లో హిందువులు రక్షించబడాలి. భారతదేశంలో వేలాది మంది బంగ్లాదేశీయులు నివసిస్తున్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరచిపోకూడదు” అని ఆయన హెచ్చరించారు.
“వారికి భూమి, భద్రత కల్పించాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. వారి ఆహారం, ఇతర అవసరాలను మేము చూసుకుంటాము. ప్రభుత్వంపై భారం పడనివ్వము” అని ఆయన చెప్పారు. భారతదేశం హిందువులకు భూమి అని హిందువులు నిర్ధారించాలని, వారు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి వచ్చినా వారిని స్వాగతిస్తామని అవిముక్తేశ్వరానంద్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులకు మిగతా ముగ్గురు శంకరాచార్యులు కూడా సంఘీభావం తెలిపారు.
కంచి శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతి పొరుగు దేశంలో హిందువులపై దాడి తర్వాత బంగ్లాదేశ్లో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల శాంతి, భద్రత, సుస్థిరత కోసం ఆయన విజ్ఞప్తి చేశారు, శక్తి పీఠమైన ఢాకేశ్వరి మందిర్తో సహా అనేక చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. అక్కడ పెద్ద సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారని గుర్తు చేసారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిపై పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే దీనిని ఆపాలని కోరారు. శాంతిని నెలకొల్పడం ద్వారా అన్నీ సర్దుకుంటాయని, హిందువులు శాంతిని ప్రేమించే వారని, హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్లో ఇలాంటి హింస చైనా కుట్ర అని ఆయన ఆరోపించారు. “చైనాలో మసీదులు ధ్వంసం చేయబడుతున్నాయి. ముస్లింలను దేశం నుండి తరిమివేస్తున్నారు. ఇప్పుడు, భారతదేశాన్ని అస్థిరపరచడానికి చైనా బంగ్లాదేశ్ను ఉపయోగిస్తోంది. దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమైతే, రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ ఉనికి మట్టిలో పడిపోతుంది,” అని ఆయన హెచ్చరించారు.
ద్వారకా శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి భారతదేశం, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు హిందువుల పరిస్థితిపై కూర్చుని చర్చించాలని కోరారు. “పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హిందువుల పరిస్థితి బాగా లేదు. గత 50 ఏళ్లుగా జరుగుతున్నది సరైనది కాదు,” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ దేశాల్లో హిందువులు ఎదుర్కొంటున్న హింసను ప్రస్తావిస్తూ “వారి తప్పేంటి? ఎంపిక చేసి ఎందుకు చంపుతున్నారు? వారి ఆలయాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఈ విషయంలో నాలుగు పీఠాల శంకరాచార్యుల అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
“ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనుగొనాలి. కాకపోతే, హిందువులు ప్రపంచంలో ఎక్కడ నివసించినా, సమస్యలు వచ్చినప్పుడు, వారికి సహాయం చేసేవారు ఎవరూ ఉండరు” అని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఒక సందేశంగా, వారు ఎక్కడ ఉన్నా సనాతన ధర్మాన్ని రక్షించడానికి మరి,యు దానిని కాపాడుకోవడానికి వారు చేయగలిగినదంతా చేయాలని ఆయన వారిని కోరారు.
“బంగ్లాదేశ్లో, ఇంకా 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, వారు సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు, దానిని పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశంలోని ముస్లింలు అక్కడ హత్యలు ఎవరు చేస్తున్నారో కూడా ఆలోచించాలి,” అని అతను హితవు చెప్పారు.
More Stories
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర… బిజెపి ఆరోపణ
ఆత్మపరిశీలన, పునఃసమర్పణకు అవకాశంగా ఆర్ఎస్ఎస్ వందేళ్లు
‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు కాదు, శాంతిభద్రతల సమస్య