
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని మను బాకర్ అందించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సౌత్కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజత పతకాన్ని సాధించారు.
ఇప్పటి వరకు భారత్ తరపున రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన వాళ్లలో ప్రిచార్డ్, సుశీల్ కుమార్, పీవీ సింధు, భాకర్ ఉన్నారు. వారిలో ప్రిచార్డ్, భాకర్ మాత్రం ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించారు. ఇక సుశీల్, సింధులు.. వేర్వేరు ఒలింపిక్స్లో పతకాలను కైవసం చేసుకున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రెజ్లర్ సుశీల్ కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఇక హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు.. 2016 రియో గేమ్స్లో సిల్వర్ మెడల్, ఆ తర్వాత టోక్యో 2020 గేమ్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నది.
రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
భారత్ కు పతాకం గెల్చుకున్న ఈ జోడి షూటర్లు మను భాకర్, సరబ్జోత్ సింగ్లను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అభినందించారు. భవిష్యత్తులో ఈ జంట షూటర్లు మరెన్నో అవార్డులు పొందాలని ఆమె ఆకాంక్షించారు. “షూటింగ్ కోసం మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారతదేశం కోసం కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మను భాకర్, సరబ్జోత్ సింగ్లకు అభినందనలు! ఒకే ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు సాధించిన భారతదేశం నుండి మొదటి మహిళా షూటర్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె మనకు చాలా గర్వకారణం” రాష్ట్రపతి ఎక్స్ లో ఒక పోస్ట్లో రాశారు.
భారత్కు మరో పతాకాన్ని అందించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. “షూటర్లు మనల్ని గర్వపడేలా చేస్తున్నారు! ఒలింపిక్స్లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మనుబాకర్ అలాగే సరబ్జోత్ సింగ్లకు శుభాకాంక్షలు. ఈ ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యంతో పాటు జట్టు కృషిని ప్రదర్శించారు. భారత ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మనుకి ఇది వరుసగా రెండవ ఒలింపిక్ పతకం. ఆమె స్థిరమైన నైపుణ్యంతో పాటు ఆమె అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది.” అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కాగా, మను బాకర్ ఈ రేర్ రికార్డు సొంతం చేసుకోవడం పట్ల క్రీడాభిమానులు, భారత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి రామకృష్ణ బాకర్ కుమార్తె విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “నేను కూడా మీ లాగే ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది భారతీయులకు ఓ శుభవార్త. నా కుమార్తెపై మీరు చూపించిన ప్రేమాభిమానులకు నేును ఎంతో కృతజ్ఞుడను” అంటూ రామకృష్ణ బాకర్ పేర్కొన్నారు.
మరోవైపు సరబ్జోత్ సింగ్ కుటుంబం కూడా విజయానందంతో సంబరాలు చేసుకుంటోంది. సరబ్జోత్ తండ్రి జితేందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. “మను బాకర్తో పాటు నా కుమారుడు కాంస్య పతక గెలుచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనుతో పాటు ఆమె కుటుంబానికి నా శుభాకాంక్షలు. నేను గురుద్వారాకు వెళ్లి దేవుడికి ప్రార్థించుకుని వస్తాను. మా ఊర్లో ఇక సంబరాలు జరుగుతాయి.” అంటూ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు