చైనాపై అమల్లో ఉన్న నియంత్రణను సమీక్షించడంపై చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలుస్తున్నది. సంబంధిత వర్గాల ప్రకారం ఒకవేళ ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే, కేంద్ర హోంశాఖతో డీపీఐఐటీ కసరత్తులు మెదలుపెడుతుంది.
చైనా నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులకు వీసాలపై ఆంక్షల కారణంగా తాము సాంకేతిక, ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఎఫ్ డీఐ విధానాన్ని సడలించాలని దేశీయ పరిశ్రమ, ముఖ్యంగా చైనా ప్లాంట్లు, పరికరాలను ఉపయోగించే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చైనా పెట్టుబడులు రాకపోవడం వల్ల దేశ సొంత తయారీ రంగంపై ప్రభావం పడుతోందని ఆయన కంపెనీలు చెబుతున్నాయి.
గత వారం విడుదల చేసిన తాజా ఆర్ధిక సర్వేఎగుమతులను పెంచడానికి భారతదేశం తన ఉత్తరాన ఉన్న పొరుగు దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అయితే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దేశీయ సంస్థలకు నష్టం కలగొచ్చు అన్న వాదనలు కూడా ఉన్నాయి. ‘మేకిన్ ఇండియా’కు చైనా కంపెనీలను అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కీలకమైన సరఫరాలు, ఆర్థిక వృద్ధి కోసం దేశీయ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“చైనా కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడం, పాశ్చాత్య మార్కెట్లకు ఎగుమతి చేయడం స్వల్పకాలంలో ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ, ఇది భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కీలక ఉత్పాదక సామర్థ్యాల కోసం చైనా సంస్థలపై ఆధారపడటం వల్ల సరఫరా గొలుసు బలహీనతలు, భౌగోళిక భౌగోళిక ప్రమాదాలకు భారత్ గురవుతుంది,” అని గ్లోబల్ ట్రేడ్ రసెర్చ్ ఇనీషియేటివ్ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు.

More Stories
ధ్వజారోహణం హిందూత్వ అభ్యున్నతి , అస్తిత్వ ప్రతీక
హిందువులు లేకుండా ప్రపంచం ఉనికిలో ఉండదు!
విద్యార్థుల కోసం ‘జెన్-జెడ్’ పోస్టాఫీస్లు