
ఆ తర్వాత డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేశారు. అనంతరం వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత శాంతిభద్రత విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను ప్రభుత్వం నియమించలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి డీజీపీ అంజనికుమార్ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్.. రవిగుప్తాను డీజీపీగా నియమించింది.
అయితే, ఇటీవల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం, ఎక్కడ చూసినా చైన్స్నాచింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు హల్చల్ చేస్తుండటం, నడిరోడ్లపైనే హత్యలు జరుగుతుండటంతో డీజీపీ మార్పు అనివార్యమైంది. 1994 బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సీపీగా ఉండగా, సౌమ్యమిశ్రా జైళ్లశాఖ డీజీగా, శివధర్రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా, శిఖాగోయెల్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐడీగా, ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీగా, అభిలాష బిస్త్ పోలీసు అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. వీరికి ఇంకా డీజీపీ హోదా రాకపోవడంతో సీనియర్ అయిన జితేందర్ వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు