ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఏళ్ల తరబడి వినిపిస్తుంది. ఎన్డీఏ-1లో టీడీపీ భాగస్వామి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని 2019లో అధికారం చేపట్టారు. గత ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం చాలా సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. కానీ ప్రత్యేక హోదా అందని ద్రాక్షలా మిగిలిపోయింది.
ఇక 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారడంతో ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టే తరుణం ఇదే అంటూ టిడిపిపై రాజకీయంగా వత్తిడి పెరుగుతుంది. అయితే ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు టిడిపి నేతలు ఎవ్వరూ ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు.
కానీ, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి వచ్చింది.
More Stories
కేంద్రం నుండి రూ 1 లక్ష కోట్ల సహాయం కోరిన చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులకు తలుపులు తెరిచిఉంచాం
పట్టిసీమ పైపులైన్ డ్యామేజీ … ఎగిసిపడ్డ నీళ్లు