![](https://nijamtoday.com/wp-content/uploads/2021/07/Mann-Ki-Baat.jpg)
ఎన్డీయేను వరుసగా మూడోసారి ఎన్నుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. “రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు ఈ రోజు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2024 లోక్ సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు. 65 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్న ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎన్నికలు జరగలేదు. ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను” అని చెప్పారు.
రాబోయే పారిస్ ఒలింపిక్స్ గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ మెగా ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, క్రీడాకారులకు మద్దతు ఇవ్వాలని, ఉత్సాహపరచాలని ప్రజలను కోరారు. వారిని ప్రేరేపించడానికి సోషల్ మీడియాలో ‘#cheer4Bharat’ ను ఉపయోగించాలని కోరారు. ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తారని దేశం ఆశిస్తోందని చెప్పారు.
నా ప్రియమైన దేశప్రజలారా, వచ్చే నెలలో ఈ సమయానికి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యేవి. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు మీరంతా ఎదురు చూస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని తెలిపారు.
జూన్ 5న ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన ‘ఏకే పేడ్ మా కే నామ్’ ప్రచారం మెుదలుపెట్టామని ప్రధాని చెప్పారు. “ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభమైంది. నేను కూడా నా తల్లి పేరిట ఒక చెట్టును నాటాను. దేశ ప్రజలందరూ వారి తల్లితో పాటు లేదా ఆమె పేరుతో ఒక చెట్టును నాటాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని పిలుపిచ్చారు.
ఈ రోజు మన్ కీ బాత్లో ఒక ప్రత్యేకమైన గొడుగు గురించి చెప్పాలనుకుంటున్నాను అంటూ ఈ గొడుగులు మన కేరళలో తయారవుతాయని తెలిపారు. కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్కడ అనేక సంప్రదాయాలు, ఆచారాలలో గొడుగులు ఒక ముఖ్యమైన భాగం. కానీ తాను చెబుతున్న గొడుగు ‘కార్తుంబి గొడుగులు’ ఇవి కేరళలోని అట్టప్పాడిలో తయారవుతాయని తెలిపారు.
More Stories
హిందువులపై రాహుల్ ఆరోపణలను ప్రజలు ఎప్పటికి క్షమించరు
లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు