కాగా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) కసరత్తును చేపట్టాలని, కుకీ తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని, లోయ, కొండ ప్రాంతాల్లో సమానంగా కూంబింగ్ నిర్వహించాలని, మణిపూర్ ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతను కాపాడాలని, ప్రజలు ఇంటికి తిరిగి రాకుండా నిరోధించే బఫర్ జోన్లను తొలగించాలని ఇంఫాల్ ప్రజలు డిమాండ్ చేశారు.
మరోవైపు తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని సమన్వయ కమిటీ నేత జీతేంద్ర నింగోంబ తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. మణిపూర్ ఆదివాసీల నిర్మూలనకు సంబంధించిన అన్ని విధి విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ విభజనకు తాము వ్యతిరేకమన్నారు. కేవలం శాంతిని మాత్రమే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు.
More Stories
అస్సాం మార్క్స్షీట్ స్కామ్ లో ఎనిమిది మంది అరెస్ట్
గుజరాత్లో నీట్ లీకేజిపై 7 చోట్ల సిబిఐ సోదాలు
యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయి అయిదుగురు సైనికులు మృతి