
ఇదే జగన్ అంతకుముందు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోవిధంగా ఉన్నాయి. “80 శాతం ఓటర్లు పోలింగ్ బూత్లో బటన్ నొక్కారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్లో కూడా కనిపించింది. రెండూ మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఓటు వేసిన వాళ్లంతా సంతృప్తి చెందారు. 80శాతం ఓటర్లలో ఏ ఒక్క ఓటరూ ఫిర్యాదు ఇవ్వలేదు” అని పేర్కొన్నారు.
పైగా, “నేను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీవీ ప్యాట్లో సైకిల్ గుర్తు కనిపిస్తే నేనెందుకు గమ్మునుంటా? గమ్మునుండను కదా! అక్కడే బూత్లోనే గొడవ చేసి ఉండేవాడిని. ఫిర్యాదు ఇచ్చే వాడిని. ఏ పార్టీ వాడైనా ఓటేసిన తర్వాత వేరే పార్టీకి పడుతున్నట్లుగా ఎవరికీ కనిపించలేదు కాబట్టే 80 శాతం మంది జనాభా ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందారు. ఎటువంటివి ఎక్కడా జరగలేదు” అంటూ ఈవీఎంలపై భరోసా వ్యక్తం చేశారు.
జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు.” జగన్కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా?” అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం అని బుద్ధా ఎద్దేవా చేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆత్మ స్తుతి పర నింద మాని ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.
More Stories
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?
ఏఐతో డీప్ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా
లవ్ జిహాద్కు వ్యతిరేకంగా అస్సాంలో నూతన బిల్లు