బీజేపీదే అరుణాచల్ ప్రదేశ్- సిక్కింలో ఎస్​కేఎం జోరు 

బీజేపీదే అరుణాచల్ ప్రదేశ్- సిక్కింలో ఎస్​కేఎం జోరు 
2024 లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్​​ ఫలితాలతో మంచి జోరు మీద ఉన్న బీజేపీ అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  సహితం ఘనవిజయం సాధించింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్​కేఎం  ఒక సీటు మినహా అన్ని సీట్లను కైవసం చేసుకుంది.

60 సీట్లున్న  అరుణాచల్ ప్రదేశ్​ అసెంబ్లీకి 2024 ఏప్రిల్​ 19న ఎన్నికలు జరిగాయి. మెజారిటీ మార్క్​ 31గా ఉంది. మొత్తం 60 స్థానాల్లో 46 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్​ ఫిగర్​ దాటింది. దీంతో అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. మిగిలిన 50 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం మొదలైంది.

నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల ఫలితాలు జూన్‌ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ ఆదివారంతో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండటం వల్ల కౌంటింగ్​ను రెండు రోజుల ముందు ఏర్పాటు చేసింది.

2019 అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 సీట్లు వచ్చాయి. జేడీయూకి 7 సీట్లు, ఎన్​పీపీకి ఐదు సీట్లు దక్కాయి. కాంగ్రెస్​ నాలుగు చోట్ల గెలిచింది.

2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎస్​కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 32 అసెంబ్లీ సీట్లకు ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగ మొదటి నుంచి ఎస్​కేఎం దూసుకెళుతోంది. మొత్తం 31 సీట్లను గెలుచుకుంది.   ప్రధాన ప్రత్యర్థి ఎస్​డీఎఫ్​ (సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రెంట్​) 1 సీటుకు పరిమితమైంది.

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ థమన్  (ఎస్​కేఎం) రెహాన్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి పవన్ ఛాంలింగ్ రెండు చోట్ల నుండి పోటీచేసి ఓటమి చెందారు. 2019లో సిక్కింలో ఎస్​కేఎం 17 స్థానాల్లో గెలిచింది. ఎస్​డీఎఫ్​ 15 చోట్ల విజయం సాధించింది.