మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే నెల 8నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దీనిని అందించనున్నట్లు బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు.
జూన్ 8న మృగశిర ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తుందని, అప్పటి నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాల అనంతరం జూన్ 7న దూద్బౌలిలో దీనిని తయారీ చేస్తామని, భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు బత్తిని తెలిపారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని అందిస్తున్నామని బత్తిని అమర్నాథ్ గౌడ్ చెప్పారు.
ఇందుకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో, వైద్య సహాయం, భోజన సౌకర్యం, త్రాగు నీరు వంటి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసిన విధంగానే, ఈ సర్కార్ సైతం తగిన సౌకర్యాలు కల్పించామని కోరుతున్నామని చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉంటాయి. సుమారు 170 సంవత్సరాల నుంచి బత్తిన వంశస్థులు అస్తమా రోగులకు హైదరాబాద్లో ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అప్పట్లో పాతబస్తీలో పంపిణీ చేసేవారు.
భద్రతా కారణాల దృష్ట్యా దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మార్చారు. కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి, చేప పిల్లలను కొనుక్కుంటే సరిపోతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రెండు రోజుల పంపిణీ చేస్తారు. అనంతరం పాతబస్తీలోని దూద్బౌలిలోని తమ నివాసంలో బత్తిని కుటుంబం వారం రోజులపాటు చేప మందు అందిస్తారు.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి