ఎస్పీతో పాటు ఎస్డీపీవో రవీంద్రనాథ్రెడ్డి, సీఐ రాజారెడ్డిలపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7 గంటల్లోపు తెలియజేయాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సినీనటుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఈసీ తెలిపింది. ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమికూడారని, 144 సెక్షన్ అమలులో ఉన్నా జనాలను నియంత్రించటంతో పోలీసులు విఫలమయ్యారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ అయిన శనివారం తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే, అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డితో కలిసి ఉదయం అల్పాహారాన్ని వెళ్లారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.
తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలు బదిలీ
అదేవిధంగా తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు వేసింది. వైఎస్సార్సీపీకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న తెలుగుదేశం నేతల ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. ఐదుగురిని అనంతపురం బదిలీ చేసింది. జగన్మోహన్రెడ్డి, అంజూయాదవ్, అమరనాథ్రెడ్డి, శ్రీనివాసులు, వినోద్కుమార్ను అనంతపురంలో విధులు నిర్వహించాలని ఆదేశించింది.

More Stories
దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమేబీఎంస్
హైదరాబాద్ లో వాజ్పేయికు ఘన నివాళులు
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025