
ఆ ఉద్యోగాలు ఇన్నాళ్లు తీసుకున్న జీతాన్ని కూడా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. 12 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ దేబాన్సు బాసక్, మహమ్మద్ షబ్బార్ రషీద్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్ట్ తేల్చింది.
అయితే నాలుగు వారాల్లోగా టీచర్లు తమ జీతాలను వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ టీచర్ల నుంచి డబ్బును వసూల్ చేసే బాధ్యతలను జిల్లా మెజిస్ట్రేట్లకు కల్పించారు. అయితే, మానవతా కారణాలతో ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స పొందుతున్న సోనా దాస్ అనే ఉపాధ్యాయుని మాత్రం ఉద్యోగంలో కొనసాగింపుమని హైకోర్టు తెలిపింది.
“ఓఎంఆర్ షీట్లను నింపకుండా సబ్మీట్ చేసి, అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించిన వారందరు.. నాలుగు వారాల్లో, ఇప్పటివరకు తీసుకున్న జీతాలు తిరిగిచ్చేయాలి. టీచర్ల నుంచి డబ్బులు సేకరించే బాధ్యత జిల్లా మెజిస్ట్రేలకు అప్పగిస్తున్నాము,” అని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు ఇచ్చిన 300 పేజీల తీర్పును సమగ్రంగా చదివి, అర్థం చేసుకుని న్యాయపరమైన అంశాలపై చర్చిస్తామని, ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని తెలిపారు. కాగా, 2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు