
రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడలో ఆదివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆదివారంనుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భానుడి దెబ్బకు అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.రాయలసీమలోనే అత్యధికంగా జిల్లాలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నా పగటిపూట మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులుగా హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ 5 రోజులు 37 డిగ్రీల సెల్సీయస్ నుంచి 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇక, హైదరాబాద్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఒక వైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో మధ్యాహ్నం అయిందంటే ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఎండలు ఉపశమనం పొందటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు క్రమేపీ ముదురుతున్నాయి. ఏపీలో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతల నమోదవ్వగా, ఉక్కపోత ఎక్కువైంది పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మధ్య తేడా తగ్గిపోవడంతో మార్చి మొదటి వారంలోనే ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది. వచ్చే మూడు నెలలు ఎండలు మరింత మండిపోవడం ఖాయం అని జనం భయపడుతున్నారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే