
తెలంగాణ విమోచన ఉద్యమం ఆధారంగా నిర్మించిన ‘రజాకార్’ చిత్రం మార్చి 1వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. హిందీలోనూ రానుంది. ఈ చిత్రం ట్రైలర్ ను సోమవారం విడుదల చేయగా, హిందీ ట్రైలర్ను స్టార్ నటి కంగనా రనౌత్ రిలీజ్ చేశారు. ట్రైలర్ను ప్రశంసిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం రాగా, అప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాంల ఆధీనంలో ఉండేది. అక్కడి ప్రజలపై నిజాం ప్రభుత్వానికి చెందిన రజాకార్ల వ్యవస్థ పాల్పడిన దారుణాలు, దాడులు, ప్రజల తిరుగుబాటు, ఉద్యమం అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
దేశంలో హైదరాబాద్ను విలీనం కోసం అప్పటి భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఉండనుంది. ఈ సినిమాకు యాటా నారాయణ దర్శకత్వం వహించారు. బాబీ సింహా, మార్కండ్ దేశ్పాండే, రాజ్ అర్జున్, వేదిక, అనుష్య, ఇంద్రజ, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషించారు. 1947 నుంచి 1948 బ్యాక్డ్రాప్లో ఈ మూవీ ఉంది.
హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై అప్పటి నిజాం పాలకులు చేసిన అకృత్యాలు, దారుణాలను ట్రైలర్లో చూపించారు మేకర్స్. “వాళ్లు ఇక్కడ మతమన్నా మారాలి.. లేకపోతే రాజ్యమన్నా మారాలి. మతం మారితే దోస్తీ. మారకపోతే దుష్మన్” అంటూ డైలాగ్ ఉంది. అప్పటి ప్రజలను రజాకార్లు ఎలాంటి చిత్రహింసలు పెట్టారో, మారణహోమం సృష్టించారో ట్రైలర్లో ఉంది.
నిజాం పాలకులపై ప్రజలు తిరుగుబాటు చేయడం, రజాకార్లను ఎదుర్కోడం, హైదరాబాద్ను పాకిస్థాన్కు అప్పగించాలని నిజాంలు ప్రయత్నించడం లాంటి అంశాలను మేకర్స్ ఈ ట్రైలర్లో చూపించారు. “నేను ఈ హైదరాబాద్ను మరో కశ్మీర్గా మారనివ్వను” అంటూ భారత దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలు ఉన్నాయి.
ఆ తర్వాత భారత ప్రభుత్వం సైనిక చర్యలు తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్న దృశ్యాలు ఉన్నాయి. “చర్చలు లేవు. సంధి లేదు. యుద్ధం జరగాల్సిందే” అంటూ సర్దార్ చెప్పడం, సైనిక చర్యతో రజాకార్ ట్రైలర్ ముగిసింది. భారత ప్రభుత్వ ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యతో 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్యలతో హైదరాబాద్.. ఇండియాలో కలిసింది.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు