* టిటిడికి రూ.5141 కోట్ల వార్షిక బడ్జెట్
ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. మహిళలు కోసం మంగళసూత్రాలను, లక్ష్మీకాసులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయిస్తామని చెప్పారు.
హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు ఒక అమూల్యమైన కానుక అని టిటిడి పాలకమండలి సమావేశం అనంతరం సోమవారం ఆయన తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడిస్తూ రూ. 5141 కోట్ల అంచనాతో 2024- 25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్లు తెలిపారు.
టీటీడీ పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులుకు స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ రూ. 15,000 జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.
ఇక, టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, . టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేసిన్నట్లు తెలిపారు. అలాగే, రూ. 30 కోట్ల వ్యయంతో గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణం చేసేందుకు అనుమతించారు.
నారాయణవనంలో వీర భధ్రస్వామి ఆలయం అభివృద్దికి రూ. 6.9 కోట్ల కేటాయింపుతో పాటు స్విమ్స్ అభివృద్ది పనులుకు రూ. 148 కోట్లు కేటాయించారు. రూ. 2.5 కోట్తో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులకు కేటాయించారు. ఎస్ఎంసీ, ఎస్ఎస్సీ కాటేజీల అభివృద్ది పనులకు రూ. 10 కోట్లు కేటాయించారు.
వాటర్ వర్క్స్ తో పాటు అన్నప్రసాదం, టీటీడీ స్టోర్స్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు చేశారు. అలాగే వేదపాఠశాలలో ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ తెలిపింది. వేద పండితుల పెన్షన్ రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంపు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంపుతో పాటు 56 వేదపారయణదారులు పోస్టులు నియామకంకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక, ఫిబ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరుకానున్నారు.. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు, సలహాలను టీటీడీ తూచా తప్పకూండా అమలు చేస్తామని ఆయన చెప్పారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష