
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేరు ధర బుధవారం ఉదయం ట్రేడింగ్ లో 2 శాతానికి పైగా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దీంతో ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ. 5.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.5.62 లక్షల కోట్ల కన్నా ఎక్కువ. దాంతో ఎల్ఐసీ అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది.
బిఎస్ ఇలో ఎస్ బిఐ షేరు ధర 1 శాతం క్షీణించింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ సుమారు రూ.5.62 లక్షల కోట్లుగా ఉంది. నవంబర్ ప్రారంభం నుంచి ఎల్ఐసీ షేరు ధర 50 శాతానికి పైగా లాభపడడం గమనార్హం. ఐపీఓ తరువాత లిస్టింగ్ అనంతరం ఎల్ఐసీ షేరు ధర 2023 మార్చి వరకు గణనీయంగా క్షీణించి రూ.530 వద్ద ఆల్టైమ్ కనిష్టానికి చేరుకుంది.
ఆ తరువాత క్రమంగా వృద్ధి దిశగా ప్రయాణించడం ప్రారంభించింది. నవంబర్ లో 12.83% వృద్ధిని, డిసెంబర్ నెలలో 22.66% వృద్ధిని సాధించింది. అలాగే, ఈ జనవరిలో ఇప్పటివరకు 10% పైగా లాభపడింది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం ఆర్థిక పనితీరుకు సంబంధించి ఎల్ఐసీ రూ .17,469 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో కొత్త బిజినెస్ ప్రీమియం (వ్యక్తిగత) 2.65 శాతం పెరిగి రూ.24,535 కోట్ల నుంచి రూ.25,184 కోట్లకు చేరింది. కొత్త వ్యాపార ప్రీమియం అనేది జీవిత బీమా ఒప్పందం మొదటి పాలసీ సంవత్సరంలో చెల్లించాల్సిన ప్రీమియం.
More Stories
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి