అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో (26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు టీ20ల సిరీస్లో 2-0తో ఆధిక్యం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సునాయనంగా సిరీస్ గెల్చింనట్లయింది.
యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే(32 బంతుల్లో 63 నాటౌట్, 5ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. ఓపెనర్ రోహిత్శర్మ(0) వరుసగా రెండో మ్యాచ్లో పరుగుల ఖాతా తెరువకుండానే సున్నాకు వెనుదిరిగాడు. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గులాబ్దిన్ నయీబ్(57) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సహచర బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు.
ప్రత్యర్థి తన బౌలింగ్తో కట్టడి చేసిన అక్షర్ పటేల్(2/17)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మూడో మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో జరుగనుంది. బ్యాటింగ్ ప్యారడైజ్గా పేరు గాంచిన ఇండోర్లో యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీనియర్లు ఆకట్టుకోలేని చోట అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అఫ్గన్ బౌలర్లను ఊచకోత కోశారు.
More Stories
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బ్రిజ్భూషణ్ టికెట్ను కొడుక్కి బిజెపి సీట్
రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు