2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

భారతదేశాన్ని 2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో పదవ ”వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్”ను ప్రధాన మంత్రి బుధవారంనాడు ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పదేళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ఈరోజు 5వ స్థానంలోకి వచ్చిందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని ప్రధాన ఎజెన్సీలన్నీ అంచనా వేస్తున్నాయని ఆయన తెలిపారు. యావత్ ప్రపంచం ఇదే అంచనాలతో ఉందని పేర్కొంటూ అయితే ఇది జరిగితీరుతుందని తాను గ్యారెంటీ ఇవ్వదలచుకున్నానని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ పరిస్థితిలు అందరికీ తెలిసిన విషయమేనని, ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని అభివృద్ధిలో పురోగమన బాట పట్టడం వెనుక గత పదేళ్లలో సంస్థాగత సంస్కరణలో మనం దృష్టి సారించడమే ప్రధాన కారణమని చెప్పారు.  నేడు అస్థిరత్వంతో నిండిన ప్రపంచంలో సుస్థిరతకు పునాదిగా వెలుగొందుతున్న భారత్ లో పెట్టుబడులకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపిచ్చారు.

ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా పరిగణించాలని ఆయన సూచించారు. సుస్థిరమైన పరిశ్రమ, మౌలికసదుపాయాల, తయారీరంగంల పట్ల భారత్ దృష్టి సారిస్తున్నట్లు ప్రధాని వివరించారు.

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ సత్తా, సామర్థ్యం, పోటీతత్వం పెరిగిందని ఆయన తెలిపారు.  యూఏఈకి చెందిన కంపెనీలు భారత్ లోని ఫోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో బిలియన్ల డాలర్లు కొత్త పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకుందని మోదీ చెప్పారు. సుస్థిరతకు కీలక స్తంభంగా భారత్‌ వైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. 

వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయెద్ పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత పరిపుష్టం కావడానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరుకావడం ఒక సంకేతమని ప్రధాని తెలిపారు.

రాబోయే 25 ఏళ్లు భారత్ కు అమృత్ కాల్

భారతదేశం ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పూర్తి చేసుకుందని, ఇప్పుడు రాబోయే 25 ఏళ్లపై దృష్టి సారించిందని ప్రధాని మోదీ చెప్పారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సమాయానికి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దడం మన ముందు ఉన్న లక్ష్యమని అని వెల్లడించాయిరు. ఆ కారణంగా రాబోయే 25 ఏళ్ల అమృత్ కాల్‌గా ముందుకు వెళ్తామని చెప్పారు. 

అమృత్‌ కాల్‌ దిశగా జరుగుతున్న తొలి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ఇది కావడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వాములుగా 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని మోదీ తెలిపారు.