అయోధ్యలో దిగ్విజయంగా రామమందిర నిర్మాణం పూర్తవుతుండటం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈ నెలలో జరగబోతుండడంతో దేశ, విదేశాలలో పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామభక్తులపై విద్వేష పూరితంగా వ్యవహరిస్తోంది. రామజన్మభూమి కోసం పోరాటం చేసిన 31 ఏళ్ల క్రితం నమోదు అయిన కేసులో ఇప్పుడు ఓ నిందితుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది.
మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో 3వ నిందితుడు శ్రీకాంత్ పూజారిని గత శుక్రవారం కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కేసు నమోదు అయిన సమయంలో ఆ కేసులోని నిందితులు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు. ఇప్పుడు వారందరికీ 65-70 ఏళ్లు ఉంటాయి.
రాజు ధర్మదాస్, శ్రీకాంత్ పూజారి, అశోక్ కలబురగి, షణ్ముఖ్ కటగర, గురునాథ కటిగార, రామచంద్ర కలబురగి, అమృత కలబురగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరసేవకు ముందు అంటే 1992 డిసెంబర్ 5వ తేదీన హుబ్బళి నగరంలో అల్లర్లు జరిగి ఓ దుకాణానికి నిప్పు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి హుబ్బళిలోని షహర్ పోలీస్ స్టేషన్లో 31 ఏళ్ల క్రితం 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ప్రస్తుతం ఈ పాత కేసును రీ ఓపెన్ చెయ్యాలని హుబ్బళి పోలీసులు నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. సిద్దరామయ్య ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ బిజెపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం భారీ నిరసనలు చేపట్టారు. ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో గుర్తించబడిన నిరసనల సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోకతో సహా బిజెపి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు