దంతెవాడ- సుక్మా ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు మృతి

దంతెవాడ- సుక్మా ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని తుమ్కాపాల్, డబ్బా కున్నా గ్రామాల మధ్య అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ సమయంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నక్సల్స్ సంబంధిత సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ జవాన్‌లు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాసిబ్బందికి నక్సలైట్‌లు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
 

కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల దబ్బాకున్నా గ్రామ శివార్లలోని కొండపై ఉన్న నక్సలైట్లను ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని, బస్తర్‌ రేంజ్‌ ఐజీపీ సుందర్‌రాజ్ చెప్పారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు.

నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సమయంలో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం ఆ ప్రాంతంలో ఉందని ఆయన చెప్పారు. ఆ సమయంలో నక్సలైట్‌తో ఎదురుకాల్పులు జరిగాయి.  రాష్ట్ర పోలీసు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), బస్తర్ ఫైటర్స్‌లోని రెండు విభాగాల సిబ్బంది ఆపరేషన్‌ను ప్రారంభించారని సుందర్‌రాజ్ పి చెప్పారు. ఈ ఆపరేషన్ దంతెవాడ-సుక్మా అంతర్ జిల్లా సరిహద్దులోని తుమ్‌క్‌పాల్ పోలీస్ క్యాంపు నుంచి దబ్బకున్న వైపు సాగుతోంది.