
దీనితో పలు ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలకు ఇబ్బంది ఏర్పడింది. దేశమంతటా బ్లాకౌట్ పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ వ్యవస్థలో ప్రధాన వైఫల్యం ఏర్పడటంతో కరెంటు సరఫరా దిగజారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా స్థంభించిపోయాయి. సిలోన్ ఎలక్ట్రిసిటి బోర్డు (సెబ్) అధికార ప్రతినిధి నోయిల్ ప్రియాంత పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు, లోపాలను సరిదిద్ది విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటిలోగా విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరణ జరుగుతుందనేది చెప్పలేమన్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యాపార సంస్థలు, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. ఎటిఎంలు, సెల్ఫోన్ల పనిచేయని స్థితి ఏర్పడింది. బ్లాకౌట్లతో భద్రతా ఏర్పాట్లకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రత్యేకించి పలు భద్రతా కార్యాలయాలకు ఉండే అలారం వ్యవస్థలు , ఎలక్ట్రానిక్ ఫెన్స్లు పనిచేయకుండా పోతాయని, దీనితో ప్రస్తుత ఆర్థిక సంక్షభ దశలో నేరస్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సరఫరా వ్యవస్థలో లోపంతో దేశవ్యాప్తంగా శనివారం సాయంత్రం ఐదున్నర గంట నుంచి కరెంట్ లేకుండా పోయింది. రాత్రి పూర్తిగా అంధకార బంధురం అయింది. ఉన్నట్లుండి పూర్తిస్థాయిలో విద్యుత్ సంక్షోభం నెలకొనడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. గత ఏడాది కూడా దేశంలో విద్యుత్సంక్షోభం నెలకొంది.
సాంకేతిక కారణాలతో ఇప్పుడు వ్యవస్థలో లోపాలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఎక్కువ సేపు అంతరాయం ఏర్పడితే అది ఇతరత్రా సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం అయింది. కాట్మలే, బియగమా మధ్య మెయిన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లలో సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు.
2022 లో శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. శ్రీలంక వ్యాప్తంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది.
మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా శ్రీలంకలో విద్యుత్ కోతలు సర్వ సాధారణం అయ్యాయి. అయితే ఇప్పటికే శ్రీలంకలో రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక