
చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, రోగ లక్షణాలు న్యుమోనియాను పోలి ఉన్నాయని కధనాలు వచ్చాయి. చైనా ఆసుపత్రుల్లో ఈ తరహా లక్షణాలతో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని సమాచారం. మరోవైపు చైనాలో కొత్త రకం వైరస్ వ్యాపించిందనే వార్తలను డ్రాగన్ తోసిపుచ్చింది. ఇవి సీజనల్ శ్వాసకోశ సమస్యేలనని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని స్పష్టం చేశారు. చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఏదేమైనా భారత్కు న్యుమోనియా ముప్పు తక్కువేనని కేంద్రం ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది.
చైనాలో అంతుచిక్కని నిమోనియాలో సరికొత్త వైరస్ ఏమీ లేదని అక్కడి ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిశీలన చేపట్టింది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ను సంప్రదించింది. బీజింగ్, లియోనోంగ్లో చేసిన పరీక్షల్లో ఎలాంటి కొత్త వైరస్ను గుర్తించలేదని స్పష్టం చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్