చంద్రయాన్ 3 తర్వాత సూర్యుడిపై అధ్యయనం నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యత ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టింది. ఆదిత్య ఎల్-1 త్వరలోనే లక్ష్యాన్ని చేరనున్నదని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వెల్లడించారు. ఆదిత్య సరైన మార్గంలోనే ప్రయాణిస్తోందని, సాఫీగా చివరి దశకు చేరుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
జనవరి 7 కల్లా ఆదిత్య ఎల్-1 తుది విన్యాసాన్ని చేపట్టి ఎల్-1 పాయింట్లోకి చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. కాగా, సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ అంతరిక్ష నౌక 125 రోజుల్లో దాదాపు 15లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యుడికి సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్ను చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం నిర్వహిస్తూ ఉంటుంది.
ఆదిత్య-ఎల్1 సూర్యుడి లాగ్రేంజియన్ పాయింట్ నుంచి చిత్రాలను తీసి భూమికి పంపుతుంది. ఇక ఆదిత్య ఎల్-1 నౌక సూర్యుడు, భూమికి మధ్య ఉన్న ఎల్-1 పాయింట్ దగ్గరలోని ‘హాలో ఆర్బిట్లో తిరుగుతుంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యుడికి సంబంధించి ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలను తీసి ఇస్రోకు చేరవేస్తుంది.
ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మూసుకెళ్లగా విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్లు ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్పై అధ్యయనం చేసేందుకు అవసరమైన డేటాను అందించనున్నాయి.
More Stories
పరీక్షా కేంద్రాలలో యూపీఎస్సీ ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా
మార్చి 2025 నాటికి అయోధ్య రామాలయం పనులన్నీ పూర్తి
ఛత్తీస్గఢ్ అడవుల్లో నకిలీ నోట్ల ముద్రిస్తున్న నక్సల్స్