
నకిలీ జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ కేసులో సమాజ్వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్, ఆయన భార్య తజీన్ శాతీమా, వారి కుమారుడు అబ్దులా ఆజంకు ఏడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన వెంటనే దోషులు ముగ్గురినీ జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని కోర్టు నుంచి నేరుగా జైలుకు పంపుతారని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా తెలిపారు.
ముగ్గురు దోషులకు ఎంపి, ఎమ్మెల్యే కోర్టు మెజిస్ట్రేట్ శోభిత్ బన్సల్ గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా 2019 జనవరి 3న రాంపూర్లోని గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. లక్నో నుంచి ఒకటి, రాంపూర్ నుంచి ఒకటి చొప్పున రెండు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందేందుకు తమ కుమారుడికి ఆజం ఖాన్, ఆయన భార్య సహాయపడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
రాంపూర్ మున్సిపాలిటీ నుంచి పొందిన బర్త్ సర్టిఫికెట్లో అబ్దుల్లా ఆజం పుట్టిన తేదీ 1993 జనవరి 1 అని ఉండగా లక్నో నుంచి పొందిన సర్టిఫికెట్లో 1990 సెప్టెంబర్ 30 అని ఉంది.
కాగా, దాదాపు 15ఏళ్ల నాటి కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ ఏడాది మొదటల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని అబ్దుల్లా కోల్పోయిన అబ్దుల్లాకు తాజాగా మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అబ్దుల్లాకు విధించిన శిక్షపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు గతవారం నిరాకరించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషులుగా తేలారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు