ప్రమాదంలో ఉన్న పౌరుల సంఖ్య, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే ప్రమాదంపై అంతర్జాతీయంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ పోరులో చిక్కుకున్న సామాన్యుల పౌరులను మానవతా సంక్షోభం నుంచి రక్షించేందుకు కావాల్సిన చర్యలను చేపడుతున్నారు. సామాన్య పౌరులను రక్షించేందుకు కొనసాగే చర్యలకు తన పూర్తి మద్దతు ఉంటుందని బైడెన్ హామీ ఇచ్చారు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత బైడెన్ ఇప్పటికే పలుసార్లు నెతన్యాహుతో మాట్లాడారు. కానీ, పాలస్తీనా అధ్యక్షుడితో చర్చించడం మాత్రం ఇదే తొలిసారి. గాజాలోని పాలస్తీనా ప్రజలకు సాయం అందించేందుకు చేపడుతున్న చర్యలను బైడెన్కు అబ్బాస్ ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం.
మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ సంక్షోభ నివారణకు పశ్చిమాసియా దేశాలతో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ యుద్ధం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు.
సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్తో పాటు యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ చర్చించారు. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్తో మాట్లాడారు. సామాన్యులను రక్షించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.
ఇదిలా ఉండగా అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా యూఎస్ఎస్ డ్వైట్ డి.ఐసన్హౌవర్ అనే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను పంపింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్ క్యారియర్ పనిచేస్తుంది.
మరోవంక, ఉగ్ర సంస్ధ హమాస్పై తమ యుద్ధం గాజా ప్రజలకు వ్యతిరేకం కాదని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) స్పష్టం చేసింది. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని ఐడీఎఫ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇజ్రాయెల్పై హమాస్ చేపట్టిన దాడులకు సంబంధించి పలు ఘటనలతో కూడిన వీడియోను ఐడీఎఫ్ షేర్ చేసింది. తమకు హమాస్ ఎలాంటి అవకాశాలనూ ఇవ్వలేదని, ఇజ్రాయెల్ను కాపాడుకునేందుకు తాము హమాస్ను ధ్వంసం చేయడం ఒక్కటే మార్గమని పేర్కొంది.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి