
”ఆసియా క్రీడల్లో మన నారీ శక్తి చూపించిన ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నాను. మీరు సాధించిన విజయాలు ఈదేశంలోని ఆడబిడ్డలను ప్రతిభను చాటుతోంది. ఇండియన్ టీమ్ చూపించిన ప్రతిభాపాటవాలతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది” అని మోదీ కొనియాడారు.
క్రీడాకారుల బృందం చరిత్ర సృష్టించిందని, అథ్లెట్లందరికీ 140 కోట్ల భారతీయుల తరఫున స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. క్రీడాకారుల కఠోర శ్రమ, సాధించిన విజయాలతో దేశంలో పండుగ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. మన దేశంలో ప్రతిభకు కొరత లేదని, కానీ కొన్ని ప్రతికూలతల కారణంగా క్రీడాకారుల ప్రతిభను మెడల్స్గా మార్చుకోలేకపోయామని పేర్కొ న్నారు.
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 100కు పైగా పతకాలు సాధించుకు వచ్చారు. 28 స్వర్ణ, 38 రజిత, 41 కాంస్య పతకాలు సాధించారు. స్క్వాష్లో రెండు స్వర్ణ పతాకలతో సహా ఐదు పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్లో మెన్స్ డబుల్స్తో స్వర్ణ పతకంతో సహా మూడు పతకాలు సాధించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?