పాలస్తీనా, హమాస్‌ల వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసిన భారత్

పాలస్తీనా, హమాస్‌ల వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసిన భారత్
ఇజ్రాయేల్, హమాస్ తీవ్రవాదుల మధ తీవ్రమైన పోరు జరుగుతున్న వేళ పాలస్తీనా, హమాస్‌‌లకు మద్దతుగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా మరికొన్ని ఇస్లాం దేశాలకు చెందిన హ్యాకర్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయేల్‌కు భారత హ్యాకర్లు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో పాలస్తీనా, హమాస్‌లకు చెందిన కీలక వెబ్‌సైట్‌లను భారత బృందం హ్యాక్‌ చేసి షాకిచ్చింది. 
 
పాలస్తీనా, హమాస్‌కు మద్దతుగా ఓపీఇజ్రాయేల్‌ (OPISRAEL), ఓపీఇజ్రాయేల్‌వీ2 (OpIsraelV2) పేరుతో మిస్టీరియస్‌ టీమ్‌ బంగ్లాదేశ్‌, అనానమస్‌ సూడాన్‌, టీమ్‌ ఇన్‌సాన్‌ పాకిస్థాన్‌ వంటి హ్యాకర్లు రంగంలోకి దిగాయి. ఇజ్రాయేల్‌ రక్షణ వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్‌ దాడులకు ప్రయత్నించాయి.
అయితే, వారి ప్రయత్నాలను ఇజ్రాయేల్ ముందే పసిగట్ తన అధికారిక వెబ్‌సైట్‌ల‌లోకి ఎవరూ చొరబడకుండా జియో లాకింగ్‌ చేసింది.
దీంతో హ్యాకింగ్ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ మేరకు డార్క్‌నెట్‌లో హ్యాకర్ల మధ్య సంభాషణలు బయటకొచ్చాయి.  ఈ నేపథ్యంలో ‘ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌’ అనే పేరుతో పనిచేస్తున్న భారత హ్యాకర్ల బృందం ఇజ్రాయేల్‌కు మద్దతుగా నిలిచింది. పాలస్తీనా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు హమాస్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి షాకిచ్చింది. 
 
పాలస్తీనా వెబ్‌ మెయిల్‌ ప్రభుత్వ సర్వీస్‌, పాలస్తీనా జాతీయ బ్యాంకు వెబ్‌సైట్‌, పాలస్తీనా టెలీ కమ్యూనికేషన్‌ కంపెనీలతో పాటు హమాస్‌ అధికారిక వెబ్‌సైట్‌లను తాము హ్యాక్‌ చేసినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. కాగా, అత్యంత శత్రు దుర్బేధ్యమైన ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ క్షిపణి వ్యవస్థను అనాసమస్ సూడాన్ హ్యాకర్ టీమ్ టార్గెట్ చేసింది. ఇది మీడియాను కూడా విడిచిపెట్టలేదు. ఇజ్రాయేల్ అధికారిక మీడియా జెరూసలేం పోస్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. ఆ వెబ్‌సైట్ 5 గంటలకు పైగా నిలిపివేశారు.
 
సైబర్‌ సెక్యూరిటీ విషయానికి వస్తే ఇజ్రాయేల్ ప్రపంచంలోని అత్యుత్తమ వ్యవస్థను కలిగి ఉంది. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలకు ఇది ఆతిథ్యం ఇస్తుంది. దాని సైబర్ రక్షణ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పటిష్టమైంది. కాబట్టి హ్యాకర్లకు వీటిని హ్యాక్ చేయడం అంత సులువుకాదు. ఇజ్రాయేల్ సైనిక బెదిరింపులను మాత్రమే కాకుండా సైబర్‌ ముప్పులను కూడా ఎదుర్కొంటోంది.