
విపక్ష కూటమికి నాయకుడు లేడని, నాయకత్వంపై గందరగోళం ఉందని ప్రధాని విమర్శించారు. ”ముంబైలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక పాలసీ రూపొందించారు. భారతీయ సంస్కృతిపై దాడి…భారతీయుల విశ్వాసాలపై దాడి చేయడమే ఇండీ ఎలయెన్స్ విధానం” అని మోదీ మండిపడ్డారు. భారతీయుల సంస్కృతి, విశ్వాసాలపై దాడి చేయాలని.. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు.
దేశ కోసం ప్రాణాలు అర్పించిన వారు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని వివరించిన ప్రధాని.. దేవి అహల్యాబాయి హోల్కర్ వంటి వారికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిన సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార కూటమి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. సనాతన ధర్మం ఇచ్చిన బలంతో ఝాన్సీ లక్ష్మీబాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడ,ఆమె తన ఝాన్సీ రాజ్యాన్ని వదులుకోనని చెప్పినట్లు ప్రధాని గుర్తు చేశారు.
మరోవైపు, సనాతన ధర్మం తన జీవితానికి ఎంతో అవసరమని మహాత్మాగాంధీ చెప్పారని, తాను రాముడి నుంచి స్ఫూర్తి పొందానని చెప్పినట్లు తెలిపారు. అందుకే ఆయన కన్నుమూసే సమయంలో హే రామ్ అన్నారని వెల్లడించారు. దేశ అబివృద్ధి కానీ, రాష్ట్రాల అభివృద్ధి పూర్తి పారదర్శకత్వంగా, అవినీతి రహితంగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా మధ్యప్రదేశ్ను గుర్తించిన రోజుల్లో రాష్ట్రాన్ని చిరకాలం పాలించిన నేతలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అవినీతి, నేరాలకు నిలయంగా రాష్ట్రం ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయలకు దూరంగా రాష్ట్రం ఉండేదన్న విషయం అప్పటి జనరేషన్ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, ఇంటింటా విద్యుత్ వెలుగులు వచ్చాయని చెప్పారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన