రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు

రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు
 
టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో గుంటూరులో  ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం  తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నారు. మరోవంక, హైదరాబాద్ లో ఆయనకు సంబంధించిన ట్రాన్స్​ట్రాయ్​  కార్యాలయాలు, డైరెక్టర్​, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, గృహాలపై  కూడా ఈడీ దాడులు జరుగుతున్నాయి.
మంగళవారం తెల్లవారుజాము నుంచి 10 మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. సీబీఐ ట్రాన్స్‌స్టాయ్‌ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు. ట్రాన్స్‌స్టాయ్‌ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హవాలా, మనీ లాండరింగ్ ఆరోపణలతో రాయపాటి ఇల్లు, కంపెనీలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రాయపాటి కంపెనీతో పాటు 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.. ఈ కంపెనీకి చెందిన పలువురి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, హైదరాబాద్‌లో ఈ సోదాలు చేస్తున్నారు. గతంలో బ్యాంకుల నుంచి రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

ఇప్పటికే రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. పలు కంపెనీల్లో పెట్టుబడులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు.  ట్రాన్స్​ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి గతంలో మనీ లాండరింగ్ కేసు నమోదయింది.

జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ట్రాన్స్​ట్రాయ్​ డైరెక్టర్​గా ఉన్న మాలినేని సాంబశివరావు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇళ్లు, ఆపీసులపై ఏకకాలంలో ఈడీ సోదాలు జరుపుతోంది. దాదాపు 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​, మణికొండ, పంజాగుట్టలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ట్రాన్స్​టాయ్​ పవర్​, టెక్నో యూనిట్​ ఇన్​ఫ్రా, కాకతీయ క్రిస్టల్​ పవర్​ లిమిటెడ్​, ట్రాన్స్​ట్రాయ్​ రోడ్డు ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్​గా ఉన్నారు.