
కరోనా సంక్షోభంతో ప్రపంచం యావత్తు బెంబేలెత్తిపోయింది. వైరస్ భయాలు, ఆంక్షలు తలుచుకుంటే కొంతమందికి ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. అయితే కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావొచ్చునని తాజా అధ్యయనం ఒకటి అంచనా వేయడంతో మరింత ఆందోళన కలుగుతుంది.
ఇతర దేశాల నుంచి జంతువుల దిగుమతి, పశువుల తరలింపు, వధకు సంబంధించి అమెరికాలో కట్టుదిట్టమైన నియంత్రణ లేదని, ఫాంహౌజ్ల్లో పనిచేసే వారు జునోటిక్స్ (జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు) బారిన పడే అవకాశముందని, అనంతరం ఇది కరోనా వంటి మహమ్మారిగా మారే ప్రమాదముందని ‘హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ వర్సిటీ’ అధ్యయనం హెచ్చరించింది. అమెరికాలో పందులు, కోళ్ల ఫామ్లు, పశువులు, క్రూర మృగాలకు సంబంధించి మార్కెట్లపై సరైన నియంత్రణలు, నిబంధనలు పాటించటం లేదని అధ్యయనం తెలిపింది.
నివేదిక రూపకల్పనలో ఒకరైన యాన్ లిండర్ మాట్లాడుతూ, ‘జునోటిక్స్ ముప్పు అమెరికాకే ఎక్కువ. కోళ్లు, పశువుల పెంపకం జనాల మధ్యలోకి వచ్చింది. క్రూర మృగాల క్రయవిక్రయాలు, దిగుమతి, తరలింపు సమయాల్లో హెల్త్ చెకప్లు చేయటం లేదు. కాబట్టి ప్రమాదకర వైరస్ మానవులకు సోకే అవకాశముంది’ అని పేర్కొన్నారు.
గ్లోబలైజేషన్ వల్ల అడవులు, కొండలు, గుట్టలు, ఇతర సహజ ఆవాసాలు..దెబ్బతినటంతో కొత్త వైరస్లు వస్తాయని నివేదిక తెలిపింది. అమెరికాకు ఏటా దాదాపు 22 కోట్ల జంతువులు దిగుమతి అవుతున్నాయి. జంతు చర్మాల మార్కెట్లు, పందులు, కోళ్ల పెంపకంలో వైరస్ ఇతరులకు సులభంగా సోకే అవకాశముందని యానిమల్ లా, పాలసీ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ విండర్స్ హెచ్చరించారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదు