
వాంగ్మయి వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు. గుజరాత్కు చెందిన వరుడు ప్రతీక్ ప్రధాని మోదీ కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా పనిచేస్తున్నారు.
2014లో ఆయన ఢిల్లీ పవర్ కారిడార్కు మారినా, మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పిఎంఓలో చేరారు. జూన్ 2019లో జాయింట్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ప్రతీక్ దోషి సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఓ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు.
పిఎంఓ అధికారిక వెబ్సైట్ ప్రకారం, పిఎంఓ పరిశోధన, వ్యూహ విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. “భారత ప్రభుత్వ వ్యాపార కేటాయింపు నియమాలు విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లల పెళ్లిళ్లు ఆడంబరంగా జరుగుతుంటాయి. దీనికి భిన్నంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ఒక్కగానొక్క కూతురు పెళ్లిని సాదాసీదాగా నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు ఎవర్నీ ఆహ్వానించలేదని తెలుస్తోంది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు