
ప్రతి ఒక్కరూ దేశభక్తి, జాతీయత కలిగి ఉండాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాను మలయన్ చెప్పారు. వీర సావర్కర్ దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధులు వినాయక్ దామోదర్ సావర్కర్ 140 వ జయంతిని విశ్వహిందూ పరిషత్ ఘనంగా నిర్వహించింది.
ఆదివారం భాగ్యనగర్ లోని కాచిగూడలో గల సావర్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్థాను మలయన్ గారు మాట్లాడుతూ దేశం కోసం వీర సావర్కర్ చేసిన పోరాటం నేడు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని సూచించారు. ఆంగ్లేయులు విధించిన అతి భయంకరమైన శిక్షణ అనుభవించి దేశం కోసం పోరాడిన మహనీయుడు సావర్కర్ అని కొనియాడారు.
అండమాన్ జైల్లో క్రూరమైన శిక్ష విధించినా ఏమాత్రం వెరవకుండా పోరాడిన మహనీయుడు సావర్కర్ అని పేర్కొన్నారు. సావర్కర్ పుస్తకం చదవాలని, లేదంటే సావర్కర్ సినిమా చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు పండరీనాథ్, జగదీశ్వర్, పగుడాకుల బాలస్వామి, శివరాములు, పిట్ల స్వామి, వెంకట్ తదితరులు హాజరై సావర్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి