ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో బుధవారం కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు, వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరో వైపు బీబీసీ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ చేసింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఐటీశాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచన చేసింది. వ్యక్తిగత ఆదాయం అంశాలపై ఉద్యోగులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా బీబీసీ తన మెయిల్లో స్పష్టం చేసింది. ఐటీ అధికారులు సమగ్రమైన రీతిలో సమాధానం ఇవ్వాలని బీబీసీ తన ఉద్యోగులకు తెలిపింది.
రెండో రోజు సోదాల్లో కేవలం ట్యాక్స్ డిపార్టమెంట్ను మాత్రమే ఐటీ అధికారులు టార్గెట్ చేయనున్నారు. బీబీసీపై జరుగుతున్న ఐటీ తనిఖీల అంశంపై ఇప్పటి వరకు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. సర్వేలో భాగంగా సీనియర్ మేనేజ్మెంట్ను ప్రశ్నించనున్నట్లు ఐటీశాఖ పేర్కొన్నది. పన్ను ఎగవేతలు, ఆదాయ లాభాలను దారి మళ్లించడం లాంటి నేరాలకు బీబీసీ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతంలోనూ బీబీసీకి నోటిసులు ఇచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. పలు అంశాలకు సంబంధించి సంస్థ లెక్కల్లో చూపించిన ఖర్చులపై సందేహాలు ఉన్నాయని చెప్పారు. వాటిని నివృత్తి చేసుకోవడానికి బీబీసీ అకౌంట్స్ బుక్స్ ను, బ్యాలెన్స్ షీట్ తదితర అకౌంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఐటీ అధికారులతో మంగళవారం కొందరు ఉద్యోగులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఎటువంటి వారెంట్ లేకుండా ఎలా తమ సంస్థలోకి ఎంట్రీ అయినట్లు వాళ్లు ప్రశ్నించారు. పన్ను పేరుతో తమ వద్ద ఉన్న సమాచారాన్ని డెస్క్టాప్ల నుంచి సేకరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
More Stories
నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?
నటి తమన్నా భాటియాకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటిస్
ఢిల్లీ లిక్కర్ కేసులో క్విడ్ ప్రోకో