 
                ఏపీ సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గతేడాది కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
సీఐడీ విభాగంలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు మోపుతున్నారని, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నారని హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
గతేడాది అక్టోబర్లో రాసిన లేఖపై కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పందించారు. ఇప్పుడు  పోస్టులో లక్ష్మీనారాయణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు లేఖ పంపారు. కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇలా ఉండగా, గతంలో నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణంరాజు సహితం తనను అక్రమంగా నిర్బంధించి, తనపై చిత్రహింసలకు పాల్పడినట్లు కూడా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లోక్ సభ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవంక ఐపీఎస్ అధికారిగా ఉంటూ మతప్రచారంకు పాల్పడటమే కాకుండా, మతపర విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారంటూ సామాజిక సంస్థలు కూడా ఫిర్యాదు చేశాయి.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు