
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈరోజు ఫిజిక్స్లో ఈ యేటి నోబెల్ బహుమతిని ప్రకటించింది. భౌతికశాస్త్రంలో ఈ సారి ముగ్గురికి ఆ అవార్డు దక్కింది. అలేన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జిలింగర్లకు సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను ఈ యేటి ఫిజిక్స్ నోబెల్ బహుమతి సంయుక్తంగా వరించింది.
కాగా, జార్జియో పారసీకి సగం పురస్కారాన్ని అందించగా, మిగతా సగాన్ని మనాబే, హలిస్మన్లు పంచుకున్నారు. భౌతిక శాస్త్రంలో గతేడాది కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి దక్కడం గమనార్హం. ఫోటాన్ల పరిశోధన, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన ప్రయోగాలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్ర నోబెల్ దక్కింది.
ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన ప్రయోగాలతో ఈ ముగ్గురి శాస్త్రవేత్తల పరిశోధన ఆధారంగా క్వాంటమ్ ఇన్ఫర్మేషన్లో కొత్త టెక్నాలజీకి మార్గం సులువైంది.
ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ నెట్వర్క్స్, సెక్యూర్ క్వాంటమ్ ఇన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు గ్రహీతలు క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలు నిర్వహించారు.
రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్గా ప్రవర్తిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు క్వాంటం సమాచారం ఆధారంగా సరికొత్త సాంకేతికతకు మార్గాన్ని క్లియర్ చేశాయి.
అలేన్ ఆస్పెక్ట్ 1947లో ఫ్రాన్స్లో ఏజెన్లో జన్మించారు. పారిస్లోని సడ్ యూనివర్సిటీ నుంచి 1983లో పీహెచ్డీ పూర్తి చేశారు. పారిస్-సాక్లే అండ్ ఈకోల్ పాలక్నిక్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న పసడేనాలో జాన్ ఎఫ్ క్లాజర్ 1942లో జన్మించారు.
న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీ నుంచి 1969లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం రీసర్చ్ ఫిజిస్ట్గా చేస్తున్నారు. ఆస్ట్రియాలోని రీడ్లో ఆంటోన్ జీలింగర్ జన్మించారు. వియన్నా వర్సిటీలో 1971లో పీహెచ్డీ పూర్తి చేశారు. వియన్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి