
నైపుణ్యం కలిగిన, అధిక ఉత్పాదక మానవ వనరుల కోసం భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ కృషి చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 21వ శతాబ్దంలో భారతదేశం యువ జనాభా అతిపెద్ద బలం అని చెబుతూ నైపుణ్యం కలిగిన భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని డాక్లాండ్స్లోని కంగన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ‘విఈటి: పాలసీ డైలాగ్ ఆన్ డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్’లో విక్టోరియన్ స్కిల్స్ అథారిటీ సీఈఓ క్రెయిగ్ రాబర్ట్సన్,, బెండిగో కంగన్ ఇన్స్టిట్యూట్ సీఈఓ సాలీ కర్టెన్ తో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
ఆస్ట్రేలియన్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ దిగ్గజాలు కూడా ఈ సదస్సు పాల్గొన్నారు. భవిష్యత్తులో నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయడానికి, ఉపాధితో వారిని కనెక్ట్ చేయడానికి, నైపుణ్య ఫలితాలను మెరుగుపరచడానికి, పరిశ్రమ, విద్యా సంబంధాలు బలోపేతం చేయడానికి ఈ సమావేశం చాల కీలకమైనది.
నైపుణ్యం అవసరాలకు చురుకైన ప్రతిస్పందనను అందించడానికి భారతదేశంలో ఆస్ట్రేలియన్ నైపుణ్య ప్రమాణాలు, సర్టిఫికేషన్ ఫ్రేమ్వర్క్లను అమలు చేసే సంభావ్యత… చర్చలలో ప్రధాన అంశాలు అయ్యాయి.. స్కిల్ డెవలప్మెంట్లో పరస్పర ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో ఆస్ట్రేలియాలో అనేక అవకాశాల కోసం భారతదేశ యువతకు నైపుణ్యం కల్పించడంలో భారతదేశాన్ని భాగస్వామిగా ఉంచడానికి ఆస్ట్రేలియా ఆసక్తిని ప్రధాన్ ప్రశంసించారు.
నైపుణ్యాల మదింపు, అర్హతలు, నైపుణ్యాల గుర్తింపు, కరికులం డెవలప్మెంట్, వర్క్ఫోర్స్ డెవలప్మెంట్ రంగాలలో కలిసి పనిచేయడానికి భారతదేశం, ఆస్ట్రేలియా రెండూ అనేక అవకాశాలను కలిగి ఉన్నాయి. మన దేశాల్లోని భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వర్క్ఫోర్స్ ప్రపంచ అవకాశాలతో అనుసంధానం అవ్వడానికి బాగా సిద్ధం చేస్తుందని ఆయన తెలిపారు.
బెండిగో కంగన్ ఇనిస్టిట్యూట్లోని ఆటోమోటివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ప్రధాన్ సందర్శించారు. ఆటోమోటివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఏస్) కస్టమైజ్డ్, హ్యాండ్-ఆన్ ఆటోమోటివ్ ట్రైనింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ను ఒకచోట చేర్చడం ద్వారా పారిశ్రామిక సంస్థల వృద్ధిని ప్రోత్సహించడానికి స్థాపించారు.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా