
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గట్టి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి, కాంగ్రెస్ పార్టీ లలో చేరగా తాజాగా మరో షాక్ ఆ పార్టీకి తగిలింది.
ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ ఆ పార్టీ కి రాజీనామా చేశారు.
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు బాధ కలిగించిందని, అందుకే టీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని..తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తేజావత్ రామచంద్రు కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి మరెంతో సేవ చేద్దామని అనుకున్నా..కానీ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం తన సేవలను వినియోగించుకోలేదని తేజావత్ రామచంద్రు విచారం వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీలో తనను భాగస్వామ్యం చేసినందుకు రామచంద్రు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా తన విధులు వంద శాతం అంకితభావంతో నిర్వర్తించానని చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పి స్ట్రోమ్ వాటర్ ప్రాజెక్ట్ లకు అన్ని క్లియరెన్స్ వచ్చేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
అలాగే సికింద్రాబాద్ కరీంనగర్ రైల్వే లైన్, 3100 కిలో మీటర్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఎయిమ్స్, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాననని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన రామచంద్రుడు త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.
More Stories
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది
కొత్తగూడెంలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు
రామ్గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!