ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో చేసిన సిఫార్సుల మేరకు ఐదుగురు న్యాయమూర్తులకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉత్తరువులు జారీచేశారు.
ఆ మేరకు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ ఉత్తరాఖండ్ హైకోర్టుకు, ముంబై హైకోర్టు న్యాయమూర్తులు
జస్టిస్ ఏఏ సయ్యద్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు, జస్టిస్ ఎస్ఎస్ షిండే రాజస్థాన్ హైకోర్టుకు, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రష్మిన్ ఎం ఛాయా గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
ఇదే సమయంలో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు.
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964, ఆగస్ట్ 2న గువాహటిలో జన్మించారు. గువాహటిలోని డాన్బాస్కో స్కూల్లో చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.
ఆయన గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా చేరారు. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కూడా నియామకమయ్యారు. 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
More Stories
ఈదురు గాలులకే కుప్పకూలిన వంతెన
దుబ్బాకకు మోదీ నిధులపై రఘునందన్ రావు పుస్తకం
తెలంగాణాలో అన్ని స్థానాల్లో బిజెపి క్లీన్స్వీ ప్