
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కీర్తి, ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచేందుకు ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని గాంధీ నగర్ నగర పాలక సంస్థ నిర్ణయించింది.
సేవా భావానికి సంబంధించిన పాఠాలను భావి తరాలు ఆమె జీవితం నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గాంధీ నగర్ మేయర్ హితేశ్ మక్వానా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ 100వ పుట్టిన రోజును జూన్ 18న జరుపుకుంటారు.
ఈ సందర్భంగా గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్ ప్రజల కోరికను, వారి భావాలను దృష్టిలో ఉంచుకుని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించారు. రేసన్ పెట్రోలు బంకు నుంచి 80 మీటర్ల పొడవుగల మార్గానికి ‘‘పూజ్య హీరాబా మార్గ్’’ అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
త్యాగం, తపన, సేవ, అంకిత భావంత పని చేయడం వంటి అంశాలను ఆమె జీవితం నుంచి భావితరాలు నేర్చుకోవడం కోసం, ఆమె కీర్తి, ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచిపోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హీరాబా గాంధీనగర్ నగర శివార్లలోని రైసన్ గ్రామంలో తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ తో కలిసి ఉంటోంది. ప్రధాని మోదీ జూన్ 17 ,18 తేదీల్లో గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. వాద్నగర్లో హీరాబా కుమారులు పెద్ద వేడుకను కూడా నిర్వహించారు.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి