
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి పరేష్ చంద్ర అధికారి కుమార్తెను ఉద్యోగం నుంచి కలకత్తా హైకోర్టు శుక్రవారం బర్తరఫ్ చేసింది. టీచర్గా ఇప్పటివరకు పనిచేసిన కాలానికి పొందిన జీతాన్ని వాపసు చేయాలని కూడా హైకోర్టు ఆమెను ఆదేశించింది.
2018 నవంబర్ నుంచి తీసుకున్న వేతనాన్ని రెండు దఫాలుగా హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని మంత్రి కుమార్తె అంకితా అధికారిని జస్టిస్ అవిజిత్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఉద్యోగ నియామక పరీక్షలో తనకు అంకితా అధికారి కన్నా అధికారి మార్కులు వచ్చినప్పటికీ తనకు కాకుండా టీచర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇచ్చారంటూ ఒక అభ్యర్థిని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
కాగా..తన కుమార్తె చట్టవిరుద్ధ నియామకంపై దర్యాప్తు జరుగుతుండడంతో మంత్రి పరేష్ శుక్రవారం ఉదయం ఇక్కడి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ హైకోర్టు విధించిన గడువును మంత్రి పాటించక పోవడంతో గురువారం సిబిఐ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మంత్రి పరేష్ చంద్ర అధికారిని 2018వసంవత్సరంలో స్కూల్ టీచర్గా తన కుమార్తెను అక్రమంగా రిక్రూట్మెంట్ చేసినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మంత్రి పరేష్ చంద్రను ప్రశ్నించింది. సీబీఐ అధికారులు కార్యాలయంలో మంత్రిని మూడు గంటల పాటు ప్రశ్నించారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 420, 120బి కింద మంత్రి, అతని కుమార్తెలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) సిఫారసుల మేరకు పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని అక్రమంగా నియమించారనే ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్ర ఏజెన్సీ పలు కేసులను విచారిస్తోంది.
బుధవారం రాత్రి హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ గంగోపాధ్యాయ ఆదేశాల మేరకు కోల్కతాలోని ఎస్ఎస్సీ కార్యాలయంలో గురువారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ని మోహరించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ఎస్సి కార్యాలయంలోకి అధికారులెవరూ ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు
సరిహద్దుల్లో పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భారత్ – చైనా