పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి వైదొలిగిన వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ మేరకు పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ విచారణ ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బహుమతిగా నెక్లెస్ను స్వీకరించారు. దీనిని పాకిస్తాన్ తొష-ఖానా (ప్రభుత్వ బహుమతుల నిధి)లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధానికి మాజీ ప్రత్యేక సలహాదారు జుల్ఫీకర్ బుఖారీకి ఇచ్చారు.
ఆయన దీనిని లాహోర్లోని జ్యుయలరీకి రూ.18 కోట్లకు విక్రయించారని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్పేపర్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) విచారణ ప్రారంభించిందని పేర్కొంది.
వాస్తవానికి ప్రభుత్వ బహుమతులను ప్రధాని తన సహాయకుల వద్ద ఉంచవచ్చు. అయితే ఆ గిఫ్ట్ విలువలో సగం మొత్తం సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనను పాటించకుండా కేవలం కొన్ని వందల రూపాయలు మాత్రమే పాకిస్థాన్ ఖజానాలో జమ చేశారని రిపోర్ట్ వివరించింది.

More Stories
బంగ్లాదేశ్లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ
ఉగ్రవాదలతో పాకిస్థాన్ సంబంధాలు బట్టబయలు
రష్యా న్యూఇయర్ వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 24 మంది మృతి