కశ్మీర్లో సోమవారం ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు ఓ జవాను.. ఒక కశ్మీరీ పండిట్.. ఇద్దరు కార్మికులు బలైపోయారు. శ్రీనగర్లోని మైసుమా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవానులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆస్పత్రిలో ఒకరు మరణించారు. మరొకరు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లా లజూరా ప్రాంతంలో బిహార్ నుంచి జీవనోపాధికి వచ్చిన ఇద్దరు కార్మికులు చనిపోయారు.
షోపియాన్ జిల్లాలోని చోటోగామ్లో షాప్ కీపర్ అయిన ఓ కశ్మీరీ పండిట్పై కాల్పులు జరిపారు. బాధితుడిని సోను కుమార్ బాల్జీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
కాగా, గత 24 గంటల్లో ఉగ్రవాదులు ఏడుగురిపై కాల్పులు జరిపారు. పుల్వామాలో జరిగిన దాడిలో గాయపడిన వారిలో నలుగురు స్థానికేతరులు కూడా ఉన్నారు.

More Stories
ఎయిరిండియా బ్లాక్బాక్స్ డేటా కోరిన బాధితులు
ఒక్కరోజే యూఏఈ నుంచి భారత్కు 90 ప్రత్యేక విమానాలు
హిమాచల్ ప్రవేశ పన్నుపై పంజాబ్ టాక్సీ, ట్రక్ డ్రైవర్లు నిరసన